లింగంపల్లి గురుకుల పాఠశాల పాత డార్మెటరీ బ్లాకుకూలిన ఘటనలో విద్యార్థులు సురక్షితం

జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

రూ.7 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు

సంగారెడ్డి : 

WhatsApp Image 2025-09-09 at 6.05.33 PM

మునిపల్లి మండలం లోని   తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ యొక్క పాత డార్మిటరీ బ్లాక్  , మంగళవారం మధ్యాహ్నం  కూలిన ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కలెక్టర్ లింగంపల్లి  రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎస్ డి ఆర్ హెచ్ బృందం చేపట్టిన సహాయక చర్యలను కలెక్టర్ పర్యవేక్షించారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న  మునిపల్లి మండలం, లింగంపల్లి గురుకుల పాఠశాలలో 1984లో నిర్మించిన పాత హాస్టల్ భవనంలో మంగళవారం మధ్యాహ్నం  గోడ కూలిన ఘటన చోటుచేసుకుంది . విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ ప్రావిణ్య హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు.  గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్ వరకు సుమారు 601 మంది విద్యార్థులు చదువుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా తరగతి గదిలో ఉండడంతో, పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.  ఆ సమయంలో హాస్టల్ భవనం పక్కగా వెళుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ ఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయని , వారికీ  జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఎస్డిఆర్ఎఫ్ బృందం కూలిన మట్టి తోలగింపు మట్టి శిఖరాల కింద ఉన్న విద్యార్థుల ట్రంకు బాక్సులు వ్యక్తిగత సామాగ్రిని సురక్షితంగా బయటకు తీస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రమాదకరమైన శిథిలావస్థకు చేరిన భవనాల వద్దకు వెళ్లకుండా కౌన్సిలింగ్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు విద్యార్థులకు తాత్కాలికంగా వసతికి ఇలాంటి ఇబ్బందులు లేవని అందుబాటులో ఉన్న తరగతి గదులు మరియు హాస్టల్ గదుల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇంజనీరింగ్ శాఖ (ఈ ఈ డబ్ల్యూ ఐ డి సి) అధికారులు సంఘటనా స్థలంలో  పాడైన భవనాలను కూల్చివేయడం , వినియోగించటానికి  వీలుగా  వుండే  గదులకు తక్షణ మరమ్మతులు చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు . రాత్రి సమయంలో పనులు కొనసాగేందుకు తాత్కాలికంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. గురుకుల పాఠశాలకు నూతన హాస్టల్ భవన నిర్మాణం కోసం రూ .7 కోట్లతో ప్రభుత్వానికి ఆమోదం కోసం ప్రతి పనులకు సమర్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు . ప్రస్తుతం పాఠశాలల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. 

Read More రాపర్తి నగర్లో ఘనంగా జరిగిన కుంకుమ పూజ..

About The Author