పెన్షన్ భిక్ష కాదు...

- ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు..
- ఘనంగా 800 మందితో జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు

WhatsApp Image 2025-12-17 at 4.17.46 PM

కరీంనగర్ :

ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగికి ఇచ్చేది బిక్ష కాదని, రాజ్యాంగ బద్దమైన హక్కనీ ఎంప్లాయిస్ జేఎసి జిల్లా ఛైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి  ఉద్ఘాటించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల సంఘ భవనంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా టీపీసీఏ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవ రెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ , ఆర్డీవో మహేష్ కుమార్ లు కీర్తిశేషులు నకారా  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగికి భిక్ష, దయాదాక్షిణ్యం కాదని, 30–35 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక–ఆర్థిక భద్రత కల్పించే హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరింపజేసిన నకారా న్యాయపోరాటానికి జిల్లా పెన్షనర్ల సంఘం, తెలంగాణ ఎన్జీవోల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి కల్తీ యుగంలో పెన్షనర్లు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేష్ కుమార్  మాట్లాడుతూ, తమ వద్దకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక కుటుంబ, ఆర్థిక సమస్యలు, మోసాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని, పెన్షనర్లు ఎవరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎలదాసరి లింగయ్య, రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య, జిల్లా కార్యదర్శి సంగేం లక్షణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీచరణ్, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఏ.ఎం. హమీద్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల రాజయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ అర్విందర్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, హజ్గర్ భరద్వాజ్, చల్ల మోహన్ రెడ్డి, నాగుల రాజారామ్, ఆదిరెడ్డి లక్ష్మీరాజం, నరసింహ చారి, మక్సుద్ మీర్జా, సత్తయ్య, ఎల్లయ్య, పద్మారావు, రాజయ్య, లచ్చిరెడ్డి, సుధాకర్, లక్ష్మి, దయాకర్ రావు, భగవాన్ రెడ్డి, అమ్మ రాజయ్య, నరసయ్య, మహమ్మద్ అజ్గర్ అలీ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు 800 మంది పెన్షనర్లు పాల్గొన్నారు. అలాగే 80 మంది సీనియర్ సిటిజన్లను శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. 

About The Author