సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ పనులను జూన్ లోగా పూర్తి చేయాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్

సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ పనులను జూన్ లోగా పూర్తి చేయాలి :  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్

హైదరాబాద్:

చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ  పనులను జూన్ లోగా పూర్తి చేయాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం నిర్మాణంలో ఉన్న సంతోష్ నగర్ ఫ్లై ఓవర్ పనులను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పనులను మరింత స్పీడ్ అప్ చేయాలని అధికారులకు సూచించారు. ఫ్లై ఓవర్ పనుల పూర్తికి జూన్ ను డెడ్ లైన్ గా పెట్టుకోవాలన్నారు.

తనిఖీలో కమిషనర్ వెంట చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.WhatsApp Image 2026-03-24 at 18.30.00 (1)

About The Author