జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమా..? రైతు సంక్షేమం ముఖ్యమా..?
- రెండు రకాల వాదనలు వినిపిస్తున్న విశ్లేషకులు..
- ఒకటి పార్టీల భవిష్యత్తు.. మరొకటి రైతులకు భరోసా..
- ప్రస్తుతం ఈ రెండు ముఖ్యమే అంటున్న మేధావి వర్గం..
- రేవంత్ రెడ్డి ముంగిట రెండు పెను సవాళ్లు..
- మేధస్సుకు సంబంధించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక..
- ప్రజా పాలన లక్షాన్ని నిలబెట్టేది సంక్షేమ కార్యక్రమాలు..
- ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్న విపక్షాలు..
- స్వార్ధ ప్రయోజనాలు తప్ప, రేవంత్ కు ప్రజాప్రయోజాన్లు పట్టమంటూ విమర్శలు..
- నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడే రాజుకున్న అగ్గి..
- రౌడీ షీటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారంటూ పలువురి ఫైర్..
- రాష్ట్రంలోని ఇతరత్రా సమస్యలను గాలికొదిలేశారన్న వ్యాఖ్యలు..
- మరి రేవంత్ ఎలాంటి సమాధానం చెబుతాడో అని ఎదురు చూస్తున్న ప్రజానీకం..
- ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న కథనం..
1.jpeg)
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
అసలెందుకు ఈ ఎన్నిక ఇంతటి ప్రాధాన్యత సంతరించుకుంది ? :
హైదరాబాద్ నగర ప్రాంతంలో రాజకీయ పరమైన స్థితిగతులను ఈ నియోజకవర్గం ద్వారా లెక్కగట్టవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. గ్రేటర్ హైదరాబాదులో ఒక కేంద్రబిందువుగా జూబ్లీహిల్స్ నియోజకవరం నిలిచిఉంది.. గమ్మత్తు ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో.. అది ఆ పార్టీకి ఒక గుర్తింపు ఇస్తుంది.. తద్వారా 150 స్థానాలకు పైగా వున్న మునిసిపల్, అలాగే స్థానిక ఎన్నికలపై ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది.
ఈ ఎన్నిక ద్వారా పార్టీలు తమ శక్తిని పరీక్షించుకుంటున్నాయని చెప్పవచ్చు.. ఎందుకంటే నగర ప్రాంతంలోని ఓటర్ల అవగాహన ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి.. ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.. కాగా ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రత్యేకంగా చూస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక రాష్ట్రంలో రైతుల బాగోగులు కూడా ముఖ్యమే.. :
రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.. రైతులు, వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రముఖ భాగం. కనీసం ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఉపాధి, భౌతిక, సామాజిక సంక్షేమం అత్యంత ముఖ్యం.. రైతు బందు లాంటి పథకాలు రైతుల పెట్టుబడులకు, వారి శ్రమను బలోపేతం చేయడానికి రూపొందించబడ్డాయి. తుఫాను లేదా అతిచూడని వాతావరణ పరిస్థితులు వ్యవసాయాన్ని భారీగా ప్రభావితం చేస్తాయి.. ఇది మనం చూస్తూనే ఉన్నాం.. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం అవసరం.
రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితి ఏంటి?
ఇటీవల వచ్చిన మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో సుమారు 4,47,864 ఏకరాలకు పైగా పంటలు నష్టపోయాయి. ప్రభుత్వం ప్రతి ఏకరాకు రూ.10,000 పరిహారం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇలా చూస్తే.. రైతుల బాగోగులు, వారి పెట్టుబడులు, పంటలకు రక్షణ ఇవి రాష్ట్రానికి ఎంతో కీలకంగా ఉన్నాయి. ఖచ్చితంగా రైతులను ఆదుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం..
తుఫాని సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది?
తుఫాను కారణంగా వచ్చిన వర్షాలు, వరదలు, పంటల నష్టం, వృద్ధి చెందిన ప్రమాదాలపై ప్రభుత్వం యథాశక్తిగా స్పందిస్తోంది. ఉదాహరణకు.. సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా, నిబద్దతతో చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.. పంట నష్టం తీవ్రంగా జరిగిన జిల్లాలపై సర్వేలు జరిపారు.. దాని ఆధారంగా పరిహారాలు కూడా ప్రకటించబడ్డాయి.
మరీ ముఖ్యంగా.. పంట నష్టం: 10,000 రూ/ఎకరానికి పరిహారం ప్రకటించబడింది. ఇక వరి నిల్వలు వర్షాలకు, వరదలకు గురయినప్పుడు ఉంటే వేరుగా చర్యలు తీసుకోవడానికి సమాయాత్తం అవుతున్నారు.. గోడౌన్కు తరలింపు, మిల్లలో నిల్వ చేయడం మొదలైనవి చేస్తున్నారు.. వరద బాధితులకు తగిన సహాయం అందిస్తున్నారు..
రైతులు తమ నష్టం నమోదు చేయించుకోవాలి.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. పంటల నిల్వ , నీటిమోవు పరిస్థితుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది.. భవిష్యత్ లో వచ్చే తుఫానుల వలన ఇంకా నష్టం జరుగకుండా ఉండటానికి చర్యలు చేపట్టారు.. అయితే ప్రజలందరూ ప్రభుత్వ పధకాల పరిధి తెలుసుకోవడం, అదనపు సాయం కోసం దరఖాస్తు చేయడం కూడా ఎంతో ముఖ్యం. ప్రజలకు ఉన్నత స్థాయి సమాచారం, మూల్యాంకనలు ప్రభుత్వ ద్వారా త్వరగా పొందడం ద్వారా నష్టం తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించారు..
చివరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చాలా ముఖ్యమైనది. అదే విధంగా రైతుల బాగోగులు రాష్ట్ర వ్యవస్థలో కీలక మైన ప్రక్రియలుగా ఉన్నాయి. తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన ఉపకార చర్యలు తీసుకుంటోంది, పంటల నష్టం, నిల్వల రక్షణ, పరిహారాలు వంటి అంశాల్లో ముందుకు వెళ్తోంది.. కనుక ఇప్పుడు చర్చనీయాంశమైన ఈ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలుగా మారాయని చెప్పవచ్చు..
