అనాధలు, పసిపిల్లల ప్రాణాలతో వికృత ఆట..

- హైదరాబాద్‌లో విస్తరిస్తున్న భిక్షాటన మాఫియా.. 
- ఏదిక్కు లేనివారు, అనాథలైన పసిపిల్లలు వీరికి పెట్టుబడి.. 
- ఈ మాఫియా వెనుక పెద్ద తలలు పనిచేస్తున్నాయా..? 
- ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్న మాఫియా.. 
- అన్ని రంగాల్లో ఎదుగుతున్న హైదరాబాద్ గుండెల్లో భయానక వాస్తవం.. 
- కోట్లరూపాయలు కొల్లగొడుతున్న దుర్మార్గులు.. 
- మాఫియా పనిచేస్తున్న విధానం చూస్తే మతిపోతుంది.. 
- వీళ్ళ నెట్వర్క్ విస్తరించిన విధానం ఒళ్లుగగుర్పొడుస్తుంది.. 
- పసిపిల్లల అవయవాలు తొలగించి రోడ్లమీదకు వదులుతారు.. 
- భిక్షాటన చేసేవారికి కనీసం ఒక్కపూట కూడా తిండి పెట్టరు.. 
- ప్రతిరోజూ 5 వందలు సంపాదించకపోతే నరకం చూపిస్తారు.. 
- ఈ వ్యవహారంలో ఎంతోమందికి లంచాలు ముడుతున్నట్టు భోగట్టా.. 
- బెగ్గింగ్ మాఫియాపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. 

download

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

Read More పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బి. రాకేష్

హైదరాబాద్‌ నగరంలో  ఐటీ, విద్య, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రంగాల్లో వేగంగా ఎదుగుతోంది.. కానీ ఈ మహానగరం మరో భయానక వాస్తవాన్ని తన కడుపులో దాచుకుంటోంది. మూగగా కన్నీరు కారుస్తోంది.. ఏదిక్కూ లేని అనాధల జీవితాలకు నిలయమైపోతోంది.. నగరంలోని వీధులు, ట్రాఫిక్ సిగ్నల్స్‌, దేవాలయాల చుట్టుపక్కల, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు భిక్షాటనకు వేదికలుగా మారిపోయాయి.. ఈ భిక్షగాళ్లలో పెద్దలతో పాటు చిన్నారులు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ వీరందరూ స్వచ్చందంగా భిక్షాటనకు దిగుతున్నారా..? లేక ఎవరో నిర్వహించే "బెగ్గింగ్ మాఫియా" చేతుల్లో బలైపోతున్నారా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత ముదురుతున్నాయి. అమాయకులైన దిక్కులేని వారి రక్తాన్ని పీలుస్తూ కోట్ల రూపాయలు వెనుకేస్తున్న ఈ మాఫియాను అరికట్టడం సాధ్యం కావడం లేదా..? లేక మాకూ డబ్బులు వస్తున్నాయి కదా..? అని ప్రభుత్వ పెద్దలు, రక్షణ శాఖలు నిమ్మకుండిపోతున్నాయా..? పలు దేశాల్లో అడుక్కోవడం నిషేధించారు.. కానీ మనదేశంలో రోజు రోజుకూ ఈ దారుణ పరిస్థితి వేళ్ళూనుకునిపోతోంది..  కొన్ని స్వచ్చంద సంస్థలు భిక్షాటన నిర్మూలనకు నాడు కట్టినా ఈ మాఫియా చేతిలో చిక్కుకుని విల విల లాడిపోతున్నాయి..  అనాథలైన పిల్లలను సేకరించడం వారిని వికలాంగులుగా మార్చివేయడం రోడ్లమీదకు వదిలేయడం జరుగుతోంది.. ఇటీవల మరో కొత్త తరహా  పద్దతిని ఎంచుకుంటున్నారు ముష్కరులు.. ఏదోఒక సంస్థను స్థాపించి, దానికి స్వచ్చంద సంస్థగా కలరింగ్ ఇస్తూ..  అందమైన అమ్మాయిలకు డబ్బాలు అప్పజెప్పుతూ విరాళాలు అంటూ వీధుల్లోకి పంపిస్తున్నారు.. పొద్దుటే ఇలాంటి అమ్మాయిలను కార్లలో తీసుకుని వచ్చి  బయట దింపడం, సాయంత్రం కాగానే తీసుకెళ్లడం జరుగుతోంది.. ఇలాంటి దారుణ వ్యవహారాలకు చెక్ పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

Read More నేటి భారతం :

అసలు నగర వ్యాప్తంగా బెగ్గింగ్ మాఫియా ఎలా పనిచేస్తోంది? పోలీసుల  విచారణలు, సామాజిక సంస్థల అధ్యయనాల ప్రకారం, ఈ భిక్షాటన వ్యవస్థ ఒక సుస్థిరమైన మాఫియా చేత నడపబడుతోంది. వీరు పేద ప్రాంతాల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి లేదా రైల్వే స్టేషన్లలో విడిపోయిన చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటారు. చిన్నారులను ఆకర్షణీయమైన మాటలతో లేదా మాయచేసి పట్టుకెళ్తారు.
కొంతమందిని బలవంతంగా నగరానికి తీసుకువచ్చి, రోజుకు ఒక నిర్దిష్ట మొత్తంలో డబ్బు సంపాదించాలని బలవంతం చేస్తారు. డబ్బు తక్కువైతే శారీరక హింస కూడా జరుగుతుంది. కొంతమందిని వికలాంగులుగా మార్చడం, మత్తు పదార్థాలకు బానిసలుగా చేయడం వంటి మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

Read More నాగారం గ్రామ సర్పంచిగా చందరాజు లావణ్య సంతోష్ నామినేషన్ దాఖలు

చిన్నారులు ప్రధాన బలిపశువులు : 

Read More సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, చార్‌మినార్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో, సిగ్నల్స్  వద్ద చిన్నపిల్లలు కారు అద్దాలు తుడుస్తూ, పూలు అమ్ముతూ లేదా నేరుగా భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. వీరిలో ఎక్కువమంది వెనుక మాఫియా నియంత్రణ ఉందని బాలసంక్షేమ విభాగం గుర్తించింది. ఒక మాఫియా గ్రూప్ సగటున 40–50 మంది భిక్షగాళ్లను నియంత్రిస్తుందని తెలుస్తోంది..  వారినుంచి రోజూ 300–500 రూపాయల వసూళ్లు చేస్తారు. ఈ డబ్బు మొత్తం పైస్థాయి “కమాండర్‌లకు” వెళ్తుంది.

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

వెనుక ఉన్న పెద్ద తలకాయలు :

Read More ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో

ఇలాంటి మాఫియాల వెనుక ఉండేవారు చాలామంది “గోస్ట్ ఆర్గనైజర్స్”.. అంటే బయటికి చారిటబుల్ ట్రస్టులు, అనాధాశ్రమాల పేరుతో పనిచేస్తూ, లోపల మాఫియా కార్యకలాపాలు నడిపించే వ్యక్తులు.. అలాగే కొందరు రాజకీయంగా ప్రభావం కలిగిన వ్యక్తుల సాయంతో ఈ నెట్‌వర్క్ కొనసాగుతుందని అనుమానాలు ఉన్నాయి. పోలీసులు కొందరిని అరెస్టు చేసినా, ప్రధాన సూత్రధారులు మాత్రం ఇంకా పట్టుబడలేదని తెలుస్తోంది.

Read More సకాలములో గుండె ఆపరేషన్ నిమిత్తమై "ఓ" పాజిటివ్ రక్తం అందజేత

ప్రభుత్వం, పోలీసుల చర్యలు :

Read More గ్రామ పంచాయతీలకు జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే “భిక్షాటన నిషేధ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ " కింద అనేక చర్యలు చేపట్టింది. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి, ప్రధాన కూడళ్లలో డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. రక్షిత గృహాలు అంటే రీహాబిలేషన్ హోమ్స్ కూడా ఏర్పాటు చేశారు.. వీటిలో పిల్లలు, మహిళలకు ఆహారం, విద్య, కౌన్సెలింగ్ అందిస్తున్నారు. అయినప్పటికీ, మాఫియా బలగాలు మళ్లీ కొత్త ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయి. సమయం చూసి విజృంభిస్తున్నాయి.. 

Read More రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చెబుతున్న ప్రకారం, “భిక్షగాళ్ల వెనుక ఉన్న మాఫియాను మూలాలతో సహా అంతమొందించాలంటే ప్రజల సహకారం అవసరం. ఎవరికైనా చిన్నారులపై అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read More హిందువులు బొందు గాళ్లు అన్నోళ్లు కాలగర్భంలో కలిసిపోయారు

సమాజం పాత్ర కూడా ఎంతో కీలకం :

ప్రమాదకర విషయం ఏమిటంటే.. చాలా మంది పౌరులు దయతో భిక్షగాళ్లకు డబ్బు ఇస్తారు, కానీ అది నేరుగా మాఫియా జేబుల్లోకి వెళ్తుంది. అందువల్ల సామాజిక సంస్థలు ప్రజలకు ఇలా సూచిస్తున్నాయి: డబ్బు ఇవ్వడం బదులు ఆహారం ఇవ్వండి. చిన్నపిల్లలు వీధిలో భిక్షాటన చేస్తూ కనిపిస్తే 1098 అనే చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ పునరావాస కేంద్రాల గురించి అవగాహన కల్పించండి. హైదరాబాద్ వీధులపై కనిపించే ప్రతి చిన్నారి వెనుక ఒక కథ ఉంది.. కొన్నింటి వెనుక మానవ ద్రోహం, మాఫియా లాభం దాగి ఉంది. ఈ దారుణ వ్యవస్థను మూలంతో నశింపజేయాలంటే ప్రభుత్వం, పోలీసులు, సామాజిక సంస్థలు, పౌరులు.. అందరూ కలిసే పోరాడాలి. నగరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మనిషి మనసు, మానవత్వం కోల్పోకూడదు.

పలకా బలపం పట్టుకుని చదువు నేర్చుకోవాల్సిన పసి చేతులు ఆర్తిగా బిక్షాటన చేస్తుంటే మనసు మూగగా రోదిస్తుంది.. వృద్ధులు, వికలాంగులు అమ్మా అని ఆడుకుంటుంటే హృదయం ద్రవిస్తుంది.. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకుని రావడం మనవల్ల కాదా..? ఖచ్చితంగా అవుతుంది.. ఇన్ని కోట్లమంది జనాభాలో ఒక్కొక్కరు ఒక్క రూపాయి చొప్పున పోగేసి ప్రతి పట్టణంలో ఒక పునరావాస కేంద్రం నిర్మించగలిగితే  ఆ కేంద్రం ఇలాంటి వారందరికీ రక్షణ కల్పించగలదు.. ఆసరాగా మారగలదు.. ప్రభుత్వాలను పక్కన బెట్టి ప్రతి ఒక్కరం ఈ దిశగా ఆలోచిద్దాం..  బెగ్గింగ్ మాఫియాకు చెక్ పెడదాం.. మన దేశ భవిష్యత్తును నిర్మించుకుందాం.. రండి మాతో చేతులు కలపండి..  " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " తలపెట్టిన ఈ మహా యజ్ఞంలో మీరూ భాగస్వాములు అవ్వండి..

About The Author