నేటి భారతం :

రైతు చెమటతో పండిన అన్నం తినేటప్పుడు..
ఆ చెమట చుక్క విలువ గుర్తు పెట్టుకో..
ఆకాశం ద్రోహం చేసినా రైతు నమ్మకం కోల్పోడు.
వాన రాని కాలంలో కన్నీళ్లతో పంటను కాపాడుతాడు రైతు.
రైతు కష్టపడతాడు…
కానీ పండించే పంటను తినే ముందు వడ్డీ చెల్లిస్తాడు.
రైతు చస్తే దేశం చలిస్తుంది, రైతు నవ్వితే దేశం పుడుతుంది..
చెమటతో పండించే వాడికి ధర లేకపోతే, దేశానికి గౌరవం ఎక్కడుంది.. ?
రైతు భూమిని తల్లి అని పిలుస్తాడు..
కాని తల్లి తన పిల్లను ఎప్పుడూ ఆకలితో ఉంచదు...
వానలు లేవని పంట మాడిపోతుంది..
కానీ రైతు ఆశలు మాత్రం ఎప్పటికీ మాడవు.
రైతు కష్టం అన్నం కంటే గొప్పది..
ఎందుకంటే అది జీవితాన్ని పండిస్తుంది.
About The Author
14 Mar 2026
