గౌడ సర్పంచులకు ఘన సన్మానం..
రవీంద్రభారతిలో అట్టహాసంగా కార్యక్రమం.. ముఖ్యఅతిథిగా నటుడు సుమన్
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన గౌడ కులస్తులైన సర్పంచులను ఉద్దేశించి హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గురువారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంజాల జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సినీ నటుడు సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2100 మంది గౌడ సర్పంచులు ఎన్నికవ్వడం హర్షణీయమని వక్తలు కొనియాడారు.
రాజ్యాధికారమే లక్ష్యం కావాలి: జైహింద్ గౌడ్
గౌడ వృత్తిదారులకు బాసట:
ఈ సన్మాన సభలో హాజరైన ప్రముఖులు లోకేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకురాలు రేఖ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి వేముల కొండల్ గౌడ్, లింగస్వామి గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సర్పంచులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
