సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

WhatsApp Image 2025-11-07 at 7.36.46 PM

సంగారెడ్డి : 

అక్టోబర్ 6న సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి  సాహితీ రాము గురు స్వామి ఆధ్వర్యంలో తిరుపతి, కాణిపాకం,అరుణాచలం,శబరిమల వరకు  మహా పాదయాత్ర గా బయలుదేరిన స్వాములు సోమవారం అరుణాచలం చేరుకున్నారు. మంగళవారం ఉదయం అరుణాచల గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. స్వామి దర్శనం పూర్తిచేసుకొని శబరి గిరి వైపు పయనమయ్యారు.  శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని సాహితీ రాము గురు స్వామి తెలిపారు.ఇప్పటి వరకు పాదయాత్ర 900 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు.యాత్ర అద్భుతం గా కొనసాగుతుందని స్వాములు ఉత్సాహంగా నడుస్తున్నారని సంగారెడ్డి గురు స్వాములు, మాత స్వాముల ఆశీస్సులు కావాలని రాము స్వామి తెలిపారు. 

About The Author