
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంఛార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయిమండలంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బడే నాగజ్యోతి హాజరై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
తదనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించిందని ఆమె తెలిపారు.ఆరు గ్యారంటీలతో 420 హామీలతో ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఇంటింటికి బాకీ కార్డులను పంపిణీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆమె కోరారు. గత 10 సంవత్సరాల కెసిఆర్ పాలన ఎరువుల కొరత రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు చెప్పులు, పట్టా పాస్ బుక్కులతో క్యూలైన్లు ఉంటున్నారని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ పాయం నర్సింగరావు మాజీ మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రేగా నర్సయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు,మాజీ ఎంపీటీసీ ముండ్రాతి రాజమౌళి దానక నర్సింగరావు,మాజీ సర్పంచులు ఊకే మోహన్ రావు గౌరవబోయిన నాగేశ్వరరావు చిడం బాబురావు మాజీ ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్ గౌరవబోయిన సీనియర్ నాయకులు కొండూరు నరేష్ అశోక్ చల్ల రజనీకర్ రెడ్డి మేడిశెట్టి మల్లయ్య రాజబాబు రామారావు యాప వెంకన్న గౌరబోయిన మోహన్ రావు గండు బిక్షపతి గ్రామ కమిటీ అధ్యక్షులు యాలం విక్రమ్ రంగు సత్యనారాయణ కోర్నబెల్లి శేషగిరిరావు,గజ్జెల సమ్మయ్య, రతన్,మహిళా నాయకురాలు నాగమ్మ సోషల్ మీడియా ఇంచార్జ్ బందెల తిరుపతి యూత్ నాయకులు కోటా సురేష్ తడక సాయి,రోహిత్ lp వెంకటేష్, శంకర్ కల్తీ వినోద్, అనిల్ నాయకులు సాయిరి లక్ష్మీనర్సు, పల్నాటి కృష్ణ,రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.