బ్రాహ్మణపల్లిలో వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం
- ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి
- సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట: మల్రెడ్డి.
అబ్దుల్లాపూర్మెట్:
మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆధ్యాత్మిక శోభతో కన్నులపండువగా సాగింది. ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న రంగారెడ్డికి ఉత్సవ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించి, స్వాగతం పలికారు.
*కనులపండువగా కల్యాణ ఘట్టం,
అనంతరం రంగారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కొలువుదీరి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆ వేణుగోపాలస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
*ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు
మల్రెడ్డి రంగారెడ్డి, శాసనసభ్యుడు
ఈ కల్యాణోత్సవ వేడుకల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.
