కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో( భారత శక్తి)జూలై 31:నిర్మల్ జిల్లా బైంసాలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో కేంద్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. సూరలోక గార్డెన్ లో లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణి చేసిన సందర్భంగా మాట్లాడారు.రేషన్ బియ్యం కోసం కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు.నా హయాంలో నియోజకవర్గం లో 17 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎం. పి. డి. వో. సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025