ఉపాధ్యాయ పదోన్నతులను పారదర్శకంగా చేపట్టాలి.

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 29: తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం(టిజియుఎస్) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం టిజియుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం(టిజియుఎస్) గిరిజన ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పని చేస్తుందని చెప్పారు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయ పదోన్నతులను ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఉద్యోగస్తులకు వెంటనే పి ఆర్ సి అమలు చేయాలని, 5 డిఎ లు  పెండింగ్ ఉన్నాయి కాబట్టి వెంటనే డి ఏ ప్రకటించాలని కోరారు.
1000002899ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ను వెంటనే రిలీజ్ చేసి ఉద్యోగులను హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ బిల్లు ప్రతినెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా మాట తప్పడం కరెక్ట్ కాదని చెప్పారు ఇప్పటికైనా వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధరావతు వస్త్రం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర బగ్గులాల్ నాయక్, లింగా నాయక్, రమేష్ నాయక్, హుస్సేన్ నాయక్ రఘురాం, రతన్ సింగ్ బద్రు నాయక్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు 
 
 
 
 
 
 

About The Author