విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి-

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


1000003227సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి )జూలై 31: విద్యార్థులు ప్రతి సబ్జెక్టు ఇష్టం తో చదివి మంచి మార్కులు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాక్షించారు. గురువారం సూర్యాపేట మండలం టేకుమట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో,సిబ్బందితో మాట్లాడినారు..ఈ సందర్భంగా కలెక్టర్  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, వ్యక్తులు చేసే వృత్తి ద్వారా సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు.విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తును రూపొందించడానికి పాఠశాల స్థాయి నుండే కష్టపడాలని తెలిపారు. 
విద్యార్థులకి తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించాలని తెలిపారు.బోధనా పద్ధతులు,భాషా నైపుణ్యాలను  పొందడంలో విద్యార్థుల పురోగతి సాధించాలని,విద్యార్థులు క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ, నెమ్మదిగా నేర్చుకునేవారికి అర్ధం అయ్యేలా భోదించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని, వారి ప్రాథమిక జ్ఞానాన్ని బలోపేతం చేయడానికి,వారి అభ్యాస ఫలితాలను పెంచడానికి అదనపు తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్  ఉపాధ్యాయులను ఆదేశించారు..ఈ కార్యక్రమం లో డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు,తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపిడిఓ బాలకృష్ణ, ప్రధాన ఉపాధ్యాయులు పాపయ్య, ఉపాధ్యాయులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 

About The Author