అవుట్‌ డోర్ ప్రకటన విధానంపై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఆదేశం జారీ


అవుట్‌ డోర్ ప్రకటన విధానంపై రాష్ట్ర హైకోర్టు  స్టేటస్ కో ఆదేశం జారీ

హైదరాబాద్:
 
అవుట్‌ డోర్ ప్రకటన విధానం – క్యూర్ 2026కు సంబంధించిన 04 మార్చి 2026 తేదీన జారీ చేసిన  జి.ఓ. ఎంఎస్ నెం. 84ను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ల సమూహంలో (డబ్ల్యూ.పీ. నెం. 8313, 8346, 8350 మరియు 8357 ఆఫ్ 2026) స్టేటస్ కో కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర  హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారాలను న్యాయమూర్తి  జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారించారు.ఈ పిటిషన్లలో ముఖ్యమైనదైన డబ్ల్యూ.పీ. నెం. 8350 ఆఫ్ 2026ను తెలంగాణ అవుట్‌ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) తరఫున, దాని కార్యదర్శి కొంకల రమేష్  మరియు ఇతర పిటిషనర్లు దాఖలు చేసి, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వు మరియు విధానం చట్టబద్ధత, అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు.
వాదనలు వినిన అనంతరం, ఈ అంశం విస్తృత ప్రజా ప్రాధాన్యత కలిగినదిగా గౌరవనీయ కోర్టు అభిప్రాయపడింది మరియు దీన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదనుగుణంగా ప్రతివాదులు తమ కౌంటర్లు దాఖలు చేయాలని  ఆదేశిస్తూ, కోర్టు  పేర్కొంది.“ఇంతలో, పిటిషనర్లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలి.”
జి.ఓ. ఎంఎస్ నెం. 84 మరియు అవుట్‌ డోర్ ప్రకటన విధానం – క్యూర్ 2026పై పిటిషనర్లు అనేక ఆందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా, భాగస్వాముల ప్రతిపాదనలను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోకపోవడం, కోర్టు ముందు ఇచ్చిన పూర్వ ఆదేశాలున్నప్పటికీ వినిపించే అవకాశం ఇవ్వకపోవడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. అలాగే డబ్ల్యూ.పీ. నెం. 5442 ఆఫ్ 2026లో జరిగిన పరిణామాలు మరియు పక్షాల వాదనలు కూడా విచారణలో ప్రస్తావించబడ్డాయి.కాగాఈ మధ్యంతర ఉపశమనం (ఇంటిరిమ్ రిలీఫ్)ను స్వాగతిస్తూ, తెలంగాణ అవుట్‌ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది .ఈ ఆదేశం భాగస్వాములకు తక్షణ రక్షణను అందించడంతో పాటు, ఈ అంశానికి ఉన్న విస్తృత ప్రజా మరియు పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించిందని పేర్కొంది. తెలంగాణలో అవుట్‌ డోర్ ప్రకటన రంగం ఆరు దశాబ్దాల చరిత్ర కలిగి ఉండి, ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని విస్తృతంగా కల్పిస్తున్నదని సంఘం వెల్లడించింది.
అన్ని భాగస్వాములకు సముచితమైన వాదనావకాశం కల్పించిన తరువాత ఈ అంశంపై న్యాయపరంగా తుది తీర్పు వెలువడుతుందనే నమ్మకాన్ని సంఘం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా హోర్డింగ్ ప్రకటనలు నిర్వహిస్తున్న వారి హక్కులను రక్షించేందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలను కొనసాగిస్తామని సంఘం పునరుద్ఘాటించింది.

About The Author