జిల్లా కేంద్రంలోని ఈవియం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి :
ప్రతి నెల నిర్వహించే తనిఖీల్లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవియం గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, సంబంధిత రిజిస్టర్లో సంతకం చేశారు.ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, తహసిల్దార్ జనార్ధన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
