Balasadan Chinnarus and Om Shanti Brahma Kumaris wish the District Collector with Rakhis

బాలసదన్ చిన్నారులు మరియు ఓం శాంతి బ్రహ్మ కుమారిలు జిల్లా కలెక్టర్ కు రాఖీలతో శుభాకాంక్షలు

కామారెడ్డి భారత శక్తి ప్రతినిధి :- ఆగస్టు 13 ; జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా బాలసదన్ చిన్నారులు రాఖీలు కట్టారు. బాల సదన్ చిన్నారులు క్యాంప్ కార్యాలయానికి వచ్చి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం శాంతి బ్రహ్మకుమారీలు జిల్లా కలెక్టర్ కు రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించారు. చిన్నారులను కలెక్టర్ ఆశీర్వదించారు. వారికి నోటు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ శీను, జిల్లా బాల రక్ష అధికారిని స్రవంతి, బ్రహ్మకుమారీలు పాల్గొన్నారు.
Read More...