*పింఛనుదారులకు అలర్ట్: ఈ నెల 28 లోగా ‘జీవన ప్రమాణ ధృవీకరణ’ తప్పనిసరి
- * సరూర్నగర్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
- * ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారుల లభ్యత
ఎల్బీనగర్
చేయూత పథకం ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు అధికారులు కీలక ప్రకటన చేశారు. పింఛను పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా సాగాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా 'జీవన ప్రమాణ ధృవీకరణ' (లైవ్లీనెస్ అథెంటికేషన్) చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని ఆయా వార్డుల లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో స్థానిక బిల్ కలెక్టర్లు లేదా పన్ను ఇన్స్పెక్టర్లను సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
వార్డుల వారీగా ధృవీకరణ కేంద్రాలు ఇవే..
లబ్ధిదారుల సౌకర్యార్థం ఆయా వార్డుల పరిధిలో నిర్దేశించిన కేంద్రాల వివరాలను అధికారులు విడుదల చేశారు.
*సరూర్నగర్ వార్డు: సర్కిల్ కార్యాలయం, సరూర్నగర్.
*ఆర్.కే.పురం వార్డు:
ఆర్.కే.పురం వార్డు కార్యాలయం, కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్.
*కొత్తపేట్ వార్డు: కొత్తపేట్ వార్డు కార్యాలయం, మహిళా భవన్.
కొత్తపేట్ వార్డు కార్యాలయం, మహిళా భవన్.
*గడ్డియన్నారం వార్డు: గడ్డియన్నారం వార్డు కార్యాలయం.
సమయం.. గడువు గుర్తుంచుకోండి!
గడువు ముగిసిన తర్వాత వచ్చే వారికి ధృవీకరణ ప్రక్రియ నిలిపివేయబడుతుందని, కాబట్టి లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో తమ జీవన ప్రమాణ ధృవీకరణను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు..jpeg)
