సృజనాత్మకతకు కేరాఫ్గా యాలాల పీఎం శ్రీ పాఠశాల
- విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్న వేసవి శిబిరం
- మట్టి కళలు, కూచిపూడి, ఇంద్రజాలంతో సందడిగా క్యాంప్
- యాలాల విద్యాధికారి పాఠశాల ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి అభినందనీయం
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలోని పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతకు కేరాఫ్ అడ్రస్గా మారింది. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి శిబిరం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ అద్భుతంగా కొనసాగుతోంది.
ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని 21 పీఎం శ్రీ పాఠశాలల్లో 15 రోజులపాటు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. యాలాల పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇదే కాకుండా కూచిపూడి నాట్యం, ఇంద్రజాల విద్యలు, ఇండోర్ గేమ్స్, దేశభక్తి గేయాలు, చక్కటి చూచిరాత వంటి అంశాల్లో కూడా నిపుణులైన వాలంటీర్లు, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యతో పాటు సంస్కృతి, కళలు, వ్యక్తిత్వ వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు..jpeg)
చదువుతో పాటు అన్ని రంగాల్లో పిల్లలను ముందంజలో నిలిపేందుకు ఈ వేసవి శిబిరం ఎంతగానో ఉపయోగపడుతోందని ఇందులో మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాడు సిద్రామేశ్వర్, ఉపాధ్యాయ బృందం కృషి అభినందనీయం అని స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటున్నారు..jpeg)
