లోక్భవన్లో గవర్నర్తో కీలక భేటీలు
శాంతిభద్రతలపై డీజీపీ, విద్యా సంస్కరణలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ చర్చ
హైదరాబాద్:
రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను బుధవారం లోక్భవన్లో పలువురు ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులు విడివిడిగా కలుసుకున్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, మహిళా సాధికారత వంటి పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.
*శాంతిభద్రతలపై సమీక్ష
తొలుత రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్ గవర్నర్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిని, పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలను వారు గవర్నర్కు వివరించారు.
*విద్యా సంస్కరణలపై చర్చ
అనంతరం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వి. బాలకిష్టారెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు తీరును, ఉన్నత విద్యా రంగంలో ప్రవేశపెడుతున్న నూతన సంస్కరణలను ఆయన గవర్నర్కు వివరించారు.
కడేల్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) సోహన్లాల్ కడేల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా గవర్నర్ను కలిసింది. దేశంలో, రాష్ట్రంలో బీమా రంగానికి సంబంధించిన ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు అవకాశాలపై వారు ఈ సందర్భంగా చర్చించారు.
*బీజేపీ నేతల భేటీ
బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం లోక్భవన్లో గవర్నర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించింది.
‘5వ ఎడిషన్ భారత్ కే అన్మోల్ నారీ శక్తి అవార్డ్స్-2026’ నిర్వాహకుడు మహ్మద్ నిజాముద్దీన్ తన బృందంతో కలిసి గవర్నర్ను కలుసుకున్నారు. మహిళా సాధికారత కోసం తమ సంస్థ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను, అవార్డుల ప్రధానోత్సవ వివరాలను వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

