మాతా శిశు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
పేదలకు సౌకర్యాలు, సేవలు అందుబాటులో ఉంచాలని సూచన

కరీంనగర్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాన్ని, మాత శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను, పలు సౌకర్యాలను పరిశీలించారు. క్రిటికల్ కేర్ విభాగంలోని ఐసియు, వార్డులు, ఆపరేషన్ థియేటర్ తోపాటు బ్లాక్ లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్ లైన్ సమకూర్చుకోవాలని, అవసరమున్న సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పేదలకు అన్ని రకాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు వైద్యులను, ఇతర సిబ్బందిని సర్దుబాటు తీసుకోవాలని అన్నారు.
Read More హైడ్రా తన లక్ష్యాన్ని చేరుకుందా..?
About The Author
08 Nov 2025
