గీతం జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవం.. 

కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. 
భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి సహకారంతో కార్యక్రమం..  

WhatsApp Image 2025-08-04 at 3.52.32 PM (1)భిన్నంలో ఏకత్వంతో పాటు ఐక్కతకు చిహ్నం భారత్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ. జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల 'సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు జాతీయ చర్చాగోష్ఠిని సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనలతో లాంఛనంగా ప్రారంభించారు.

భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ... స్వాతంత్ర్యం తరువాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్రను వివరించారు.రైతు ఉద్యమాలకు పటేల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు. చారిత్రాత్మక వార్రోలి సత్యాగ్రహం (1928) లో పటేల్ నాయకత్వాన్ని, రైతులు, భూమిలేని కార్మికుల సాధికారత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మగా మిగిలిపోతుందని చెప్పారు.రైతులు, జాతీయ ఐక్యత పట్ల పబేల్ దృక్పథంపై ఈ చర్చాగోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని  గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మన జీవితాలను పేదలు, అణగారిన వర్గాలతో పంచుకోవడంలో ఆనందం ఉంది అని శ్రీ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. అంతకు ముందు, శ్రీ జిష్ణుదేవ్ వర్మ, మహాత్మా గాంధీకి విగ్రహానికి పూలుచల్లి నివాళులు అర్పించి, ఆ తరువాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Read More కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ' యొక్క విశిష్టతను గౌరవ అతిథి, గుజరాత్ ప్రభుత్వ ఇండెక్స్ సిటీ  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ సంజయ్ జోషి వివరించారు. ఐక్యతా స్ఫూర్తిని పొందడం కోసం గుజరాత్ లో నెలకొల్పిన సర్దార్ పటేల్ స్మారక నివాళిని సందర్శించమని విద్యార్థులను జోషి ప్రోత్సహించారు. సామాజిక సమరస్థ మంచ్ జాతీయ కన్వీనర్ శ్రీ కె. శ్యామ్ ప్రసాద్ పటేల్ నాయకత్వం గురించి ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు, ఆయనపై రాజ్ మోహన్ గాంధీ రచించిన పుస్తక ప్రతులను వేదికపైనున్న ప్రముఖులకు బహుకరించారు. గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు స్వాగతోపన్యాసంలో అతిథులను సభకు పరిచయం చేయడంతో పాటు గీతం పురోగతిని సోదాహరణంగా వివరించారు.దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ పండితులు, ఆలోచనాపరులు ఈ రెండు రోజుల జాతీయ చర్చాగోష్ఠిలో పాల్గొంటున్నారు. 

Read More వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 

వీరిలో గుజరాత్ లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్ పటేల్, తెలంగాణలోని ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ఇన్-గ్రార్జ్ రిజిస్ట్రార్ అండ్ డీన్ ప్రొఫెసర్ షీలా రెడ్డి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి. నాగరాజు; అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి: యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి తదితరులున్నారు.సర్దార్ పటేల్ రైతుల పట్ల చూపిన దార్శనికత, భారతదేశ గ్రామీణ, వ్యవసాయ పరివర్తనకు దాని ఔచిత్యంతో పాటు జాతీయ ఐక్యతను పెంపొందించడంలో దాని సహకారంపై చర్చించడానికి విద్యావేత్తలు, సామాజికవేత్తలు, పరిశోధకులకు ఈ సెమినార్ ఒక వేదికను అందిస్తోంది.

Read More నూతన రేషన్ కార్డులతో పేద ప్రజలకు ఆహార భద్రత

About The Author