మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి సామాజిక బాధ్యత
బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దూస్

కరీంనగర్: మాదక ద్రవ్యాల నిర్మూలన సామాజిక బాధ్యత అని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దుస్ అన్నారు. మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాల లో "డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత" అనే అంశం పై సెమినార్ నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దూస్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ ను నిర్మూలించడంలో ముందుండాలని అన్నారు. విద్యార్థులు చైతన్య వంతులు అవుతూ దానిని నిర్మూలించడానికి మన వంతుగా అందరికీ దాని వల్ల కలిగే నష్టాలను ప్రతి ఒకరికి తెలియచేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. విద్యార్థులను చైతన్య పరచడానికి పిలవగానే వచ్చిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు,
About The Author
15 Nov 2025
