ఉద్యమకారుల త్యాగాలను కించపరచవద్దు.
హైకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి నేత పాండురంగా రెడ్డి అభ్యంతరం
హైదరాబాద్:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల పట్ల గౌరవ హైకోర్టు చేసినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటి స్థలాలు, పింఛన్ల కేటాయింపు అంశంపై విచారణ సందర్భంగా.. "మీరేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?" అని న్యాయస్థానం ప్రశ్నించడం వేలాది మంది ఉద్యమకారుల మనోభావాలను గాయపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాటం ఆత్మగౌరవం కోసమే..
ప్రభుత్వానిదే బాధ్యత
న్యాయస్థానాలు కేవలం చట్టాలనే కాకుండా, చారిత్రక నేపథ్యాలను, ప్రజా సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మేలు చేయవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
About The Author
12 Feb 2026
