నిబంధనలు గాలికి.. అక్రమ నిర్మాణమే ‘లక్ష్యం’!
- నాగోల్-బండ్లగూడ ప్రధాన రహదారిపై వెలుస్తున్న భారీ వాణిజ్య షెడ్.
- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
- ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ జోక్యం చేసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి
నాగోల్:
చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నది నానుడి. కానీ, నాగోల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు చూస్తుంటే.. ‘ముడుపులు అందితే చట్టం కళ్లు మూసుకుంటుంది’ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్లే ప్రధాన రహదారిపై, మోర్ సూపర్ మార్కెట్ సరిగ్గా ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక భారీ వాణిజ్య షెడ్ నిర్మాణమవుతోంది. ఎలాంటి జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా, కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా సాగుతున్న ఈ అక్రమ నిర్మాణం ఇప్పుడు స్థానికంగా పెను చర్చకు దారితీసింది. ప్రాథమిక దశలో వ్రాతపూర్వక ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో పని స్థానిక జనం ముక్కున వేలు వేసుకుంటున్నారు..
అధికారుల అండతోనే అక్రమ నిర్మాణం?
ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారిస్తారా?
నగరంలో అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ (HYDRAA) కమిషనర్ రంగనాథ్ ఈ విషయంపై దృష్టి సారించాలని నాగోల్-బండ్లగూడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఐఏఎస్ మరియు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లు తక్షణమే స్పందించి, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి, ఈ అక్రమ షెడ్డును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకముందే యంత్రాంగం మేల్కొంటుందో లేదో వేచి చూడాలి.
