ప్రాణం చాలా విలువైనది….
- చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి..
- టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్
కాప్రా:
ప్రాణం చాలా విలువైనదని చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నేషనల్ ఫోరెన్సిక్ మెడిసిన్ డే సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K హెల్త్ అవేర్నెస్ మారథాన్ విశేషంగా ఆకట్టుకుంది. రన్ ఫర్ హెల్త్, రన్ ఫర్ జస్టిస్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ వైద్యులు, పీజీ విద్యార్థులు మరియు వివిధ వైద్య విభాగాలకు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 12ను “నేషనల్ ఫోరెన్సిక్ మెడిసిన్ డే”గా నిర్వహిస్తారు. న్యాయ వ్యవస్థకు తోడ్పడే ఫోరెన్సిక్ మెడిసిన్ కేవలం మరణాల విచారణకే పరిమితం కాకుండా, నివారించగల మరణాల వెనుక ఉన్న కారణాలను సమాజానికి తెలియజేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, మద్యపానం, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు, జీవనశైలి వ్యాధుల కారణంగా సంభవించే విషాద మరణాలను చూసే ఫోరెన్సిక్ వైద్యులు, నివారణే ఉత్తమ రక్షణ అనే సందేశాన్ని సమాజానికి అందించేందుకు ఈ మారథాన్ నిర్వహించారు. మార్ట్యూరీలలో చూసిన అనుభవాలు ప్రజల్లో ఆరోగ్య చైతన్యంగా మారాలని టిజీఏఎఫ్ఎం ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చింది. ఈ మారథాన్ కేవలం ఫిట్నెస్ కార్యక్రమం మాత్రమే కాకుండా, ఆరోగ్య అవగాహన, రోడ్డు భద్రత, మానసిక ఆరోగ్యం, వ్యసనాల నివారణ మరియు సమాజ బాధ్యతపై ఫోరెన్సిక్ వైద్యుల నుంచి వచ్చిన శక్తివంతమైన సందేశంగా నిలిచింది. ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది కేవలం మరణాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదని జీవితాన్ని కాపాడడం కూడా అనే భావనతో టిజీఏఎఫ్ఎం చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని ప్రజారోగ్య కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో, డా. సూరజ్, డా. కృపాల్ సింగ్, డా. నాగ మోహన్, డా. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సాధారణ ప్రజలు మరియు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 300 మంది పాల్గొన్న ఈ మారథాన్లో 25–30 మంది చిన్నారులు పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..jpeg)
