ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నాం
తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం

ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నాం అని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం అన్నారు. సూర్యాపేటలోని తిరుమల గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువజన సమితి నాయకులు నారబోయిన కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సామాజిక తెలంగాణ బీసీ రిజర్వేషన్లు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంపై జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన మాట్లాడారు.సదస్సు లో ప్రారంభంలో మహాత్మా జ్యోతిబపులే,బి ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వర్గాల నుండి తెలంగాణ ఆధిపత్యం వర్గాలకు అధికార బదలాయింపు కొరకు కాదని ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించడం కొరకు సాధించుకున్నామని ఆ దిశగా అడుగులు వేయడమే తెలంగాణ ప్రజల యొక్క కర్తవ్యం అని అన్నారు.బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు. అందరూ ఐక్యంగా పోరాడి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించాలన్నారు.ప్రజలకు కావలసింది ఉచిత పథకాలు కాదు సమానత్వం, ఆత్మగౌరవం అన్నారు.రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆర్డినెన్సులను గవర్నర్లు ఆమోదంతెలపకపోవడందురదృష్టకరమన్నారు.
రిజర్వేషన్లు 50% దాటొద్దు అనేది సుప్రీం కోర్టు తీర్పు కాదని,1931 బీసీ సెన్సస్, 1961 సెన్సస్, 1979 మండల కమిషన్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని అప్పటి పరిస్థితుల్లో కోర్టు ఆ అభిప్రాయం వ్యక్తం చేసిందని చెప్పారు. రిజర్వేషన్లు సవరించుకోవచ్చని మండల కమిషన్ రిపోర్టులోనే ఉందన్నారు. రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయ సమీక్ష నుండి రక్షణ కల్పించాలి అన్నారు.
ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చట్టం చేసి పంపితే దాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదని,గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు.సామాజిక అసమానతలను నిర్మూలించడంలో రిజర్వేషన్లు కీలక సాధనమని,తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పడినదే సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం అని పేర్కొన్నారు.
పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని, ఉన్న రిజర్వేషన్లను కూడా తగ్గించారని విమర్శించారు. రాబోయే నవంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా సదస్సులు, సేమినార్లు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని,డిసెంబర్లో హైదరాబాద్లో భారీ ర్యాలీ, జనవరిలో ఢిల్లీలో దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ధర్మార్జున్ మాట్లాడుతూ బిజెపి నాయకులు ఇక్కడ మద్దతు తెలపడం కాదు ఢిల్లీలో ఉన్న పార్టీ వైఖరిందో చెప్పే విధంగా అల పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తేవాలని గతంలో తెలంగాణ బిల్లు కొరకు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ మెట్ల మీద నిరసన చెప్పారని అదే తరహాలో నేడు బిజెపి ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేయాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన కొరకు వివిధ పాయలుగా జరుగుతున్న ఉద్యమం సమన్వయంతోటి సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ ధ్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ బీసీ జేఏసీ కన్వీనర్ చనమల నరసింహ లీగల్సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ నాయక్ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్ యువజన సమితి జిల్లా కార్యదర్శి నాలుగు నాయక్ రైట్ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ పార్టీ జిల్లా నాయకులు సుమన్ నాయక్ బిసి సెల్ జిల్లా నాయకులు పిట్టల మురళి పట్టణ మైనార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ దేవత సతీష్ నాయకులు భాష బోయిన వేణు జువారి సతీష్ లోకేష్ భరత్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు పలు తీర్మానాల్ని ఆమోదించింది.
తీర్మానాలు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి.రాబోయే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలి.బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ రీతిలో ఐక్య ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర పాలకులతో చర్చించాలి..
