రూ.4 వేల కోట్లు అప్పుగా తీసుకున్న తెలంగాణ సర్కార్…

నిధుల కొరతతో సతమతమవుతున్న తెలంగాణ సర్కార్‌కు ఎట్టకేలకు రూ.4 వేల కోట్ల అప్పు లభించింది. ఆర్బీఐ నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పు సేకరించింది. సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి రుణం తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితితో, 8.02 శాతం వడ్డీతో అప్పు చేసింది. కాగా, నిధుల కొరత కారణంగా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటు కేంద్రం చివరకు రుణ సేకరణకు అనుమతినివ్వడంతో బాండ్ల వేలం ద్వారా సర్కార్ నిధులు సమీకరించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు కూడా అప్పులు తీసుకున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం రూ.12 వేల కోట్ల రుణాన్ని సేకరించాయి. ఏపీ రూ.2000 కోట్లు, మహారాష్ట్ర రూ.4000 కోట్లు, తమిళనాడు రూ.2000 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి. ఇటు నైరుతి రుతు పవనాలు రెండ్రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనులు మొదలు పెడుతున్నారు. వానలు ప్రారంభమైతే సాగు పనులూ ఊపందుకోనున్నాయి. అయినా.. ప్రభుత్వం నుంచి ‘రైతుబంధు’ సాయం విడుదలపై ఇంకా క్లారిటీ లేదు. రైతుబంధు పథకానికి మొత్తం రూ.7,500 కోట్లు కావాల్సి ఉంది. రైతుబంధు ప్రారంభమైన 2018లో మాత్రమే నిర్ణీత సమయంలో చెక్కులు పంపిణీ చేశారు. కానీ, 2019లో జూన్‌ 4, 2020లో జూన్‌ 22, 2021లో జూన్‌ 15 నుంచి చెల్లింపులు ప్రారంభించారు. అయితే తాజాగా రూ.4 వేల కోట్లు అప్పు లభించడంతో మరో రెండు, మూడ్రోజుల్లో రైతు బంధు సాయంపై ప్రకటన వెలువడే అవకాశముంది.

రూ.4 వేల కోట్లు అప్పుగా తీసుకున్న తెలంగాణ సర్కార్…

నిధుల కొరతతో సతమతమవుతున్న తెలంగాణ సర్కార్‌కు ఎట్టకేలకు రూ.4 వేల కోట్ల అప్పు లభించింది. ఆర్బీఐ నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ అప్పు సేకరించింది. సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి రుణం తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితితో, 8.02 శాతం వడ్డీతో అప్పు చేసింది. కాగా, నిధుల కొరత కారణంగా వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇటు కేంద్రం చివరకు రుణ సేకరణకు అనుమతినివ్వడంతో బాండ్ల వేలం ద్వారా సర్కార్ నిధులు సమీకరించింది.

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు కూడా అప్పులు తీసుకున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం రూ.12 వేల కోట్ల రుణాన్ని సేకరించాయి. ఏపీ రూ.2000 కోట్లు, మహారాష్ట్ర రూ.4000 కోట్లు, తమిళనాడు రూ.2000 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి.

ఇటు నైరుతి రుతు పవనాలు రెండ్రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనులు మొదలు పెడుతున్నారు. వానలు ప్రారంభమైతే సాగు పనులూ ఊపందుకోనున్నాయి. అయినా.. ప్రభుత్వం నుంచి ‘రైతుబంధు’ సాయం విడుదలపై ఇంకా క్లారిటీ లేదు. రైతుబంధు పథకానికి మొత్తం రూ.7,500 కోట్లు కావాల్సి ఉంది. రైతుబంధు ప్రారంభమైన 2018లో మాత్రమే నిర్ణీత సమయంలో చెక్కులు పంపిణీ చేశారు. కానీ, 2019లో జూన్‌ 4, 2020లో జూన్‌ 22, 2021లో జూన్‌ 15 నుంచి చెల్లింపులు ప్రారంభించారు. అయితే తాజాగా రూ.4 వేల కోట్లు అప్పు లభించడంతో మరో రెండు, మూడ్రోజుల్లో రైతు బంధు సాయంపై ప్రకటన వెలువడే అవకాశముంది.

About The Author

Related Posts