ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలి.

రాష్ట్ర చీప్ ఇన్ఫర్మేషన్ కమిషనర్

WhatsApp Image 2025-08-12 at 5.57.54 PM

కామారెడ్డి : మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం 2025 పై రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్  కార్యాలయాలలోని సమావేశ మందిరంలో  పిఐఓ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది. 

Read More కేరళ మోడల్ పాఠశాలలో ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన  రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ చీప్ కమిషనర్, కమిషనర్లకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రా లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో  మొక్కలు నాటారు.
        
అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ఆర్టిఐ చట్టం  అవగాహన సదస్సులో  రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలని రాష్ట్ర చీప్  ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్టిఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువ అందిన 3  జిల్లాలలో  కామారెడ్డి జిల్లా ఒకటని  అందుకు అధికారులను అభినందించారు. ఇదే సమయంలో కామారెడ్డి కొత్త జిల్లా కాబట్టి  ఆర్టిఐ చట్టంపైన  ప్రజలకు మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం  ఉందని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పాత కేసులను ఈరోజు ప్రత్యేక విచారణ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ విధులలో పారదర్శకత జవాబుదారీతనం  పెంపొందించేందుకు ఆర్టిఐ 2025 చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. చట్టం ఉద్దేశం ప్రకారం దరఖాస్తుదారు అడిగిన విధంగా  నిర్ణీత 30 రోజుల సమయంలో  పారదర్శకంగా ఖచ్చితమైన సమాచారాన్ని యధాతధంగా  అందించాలని సూచించారు. సమాచారం ఇవ్వడానికి తిరస్కరిస్తే సరియైన కారణాన్ని చూపాలని తెలిపారు. ఆర్టిఐ చట్టం గురించి ఎలాంటి భయం లేకుండా  ప్రజలు ఏది అడిగితే అది  అందించాలని,  ఆర్టిఐ చట్టం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులకు  చట్టం ననుసరించి చర్యలు తీసుకొని గరిష్టంగా 25 వేల రూపాయల వరకు  ఫైన్ వేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను ప్రదర్శించి  వాటిలో ఆ కార్యాలయం ద్వారా అందించే సేవలు, అధికారులు, సిబ్బంది, వివరాలు, ఈ సేవలను ఎన్ని రోజులలో అందిస్తారు తదితర వివరాలను ప్రదర్శించాలని అన్నారు. ప్రపంచంలోనే ఏ మూలలో ఉన్న వారైనా కూడా  సమాచారాన్ని సులభంగా తెలుసుకునేందుకు, ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉండేలా  ఆయా శాఖల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ఎలాంటి కారణం లేకుండా ఏ ఆఫీస్ నుంచైనా ఏ రూపంలోనైనా సమాచారాన్ని కోరేహక్కు  ప్రజలకు ఉందన్నారు. అన్ని కార్యాలయాల్లో  పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిని, ఏపీఐఓ ను నియమించాలని సూచించారు.
         
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఆర్టిఐ చట్టంపై ప్రతి ఒక్క అధికారి పూర్తి అవగాహన పెంపొందించుకొని  ఆర్టిఐ  మార్గదర్శకాల ప్రకారం అధికారులు స్పందించి పారదర్శకంగా సమాచారాన్ని  అందించాలని అన్నారు. నిన్నటి వరకు జిల్లాలో  పెండింగ్ లో గల 220 కి పైగా ఆర్.టి.ఐ  ఆప్పీల్ కేసులను కలెక్టరేట్ లో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్  ప్రత్యేకంగా హియరింగ్ నిర్వహించి పరిష్కరించనున్నారని తెలిపారు.

Read More నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం..

ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్  బోరెడ్డి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డది ఆర్.టి.ఐ  చట్టం అని,  ఆర్.టి.ఐ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పిఐఓలది, ఏపీఐఓ లదేనని, చట్టం ప్రకారం నిర్వర్తించాల్సిన బాధ్యతలను పూర్తిగా తెలుసుకొని  దరఖాస్తు దారు కోరిన సమాచారాన్ని స్పష్టంగా నిర్ణీత సమయంలో అందిస్తే దరఖాస్తుదారుకు  అధికారుల పైన,  ఆర్.టి.ఐ చట్టం పైన  గౌరవం పెరుగుతదని అన్నారు. 

Read More ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యం..


ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్ మోహ్సి నా పర్వీన్ మాట్లాడుతూ, నాలుగు నెలల క్రితం నూతన స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏర్పాటు తర్వాత పెండింగ్లో ఉన్న 18 వేల కేసులలో 2300 పైగా కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పిఐఓ అధికారులు ఆర్టిఐ చట్టం అమలుపై లేవనెత్తిన సందేశాలకు సమాధానాలు ఇచ్చారు.

Read More భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్ దేశల భూపాల్ మాట్లాడుతూ, ఆర్టిఐ చట్టం  అమలై 20 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంగా ఈ సంవత్సరాలలో  వచ్చిన కేసులను  అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు దారు తృప్తి పొందేలా నిర్ణీత సమయంలో సమాచారాన్ని అందించాలని సూచించారు.

Read More పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అడిషనల్ ఎస్పీ  చైతన్యరెడ్డి, పిఐఓ లు, ఏపీఐఓ తదితరులు పాల్గొన్నారు.

Read More  దాసరి వాడలో పోచమ్మ బోనాలు సమర్పించిన భక్తులు

About The Author