మాదకద్రవ్యాల ప్రమాదాలపై భైంసాలో అవగాహన సదస్సు..

మాదకద్రవ్యాల ప్రమాదాలపై భైంసాలో అవగాహన సదస్సు..

1000005701

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో,(భారత శక్తి) ఆగస్ట్ 13: యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు, నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, మంగళవారం ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా వైట్ టీ-షర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో, నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ నోమన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా భైంసా అసిస్టెంట్ ఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాడకం వల్ల కాలేయం, గుండె మరియు మెదడుపై తీవ్ర ప్రభావాలు పడతాయి, దీని వల్ల నిరాశ, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, అని చెప్పారు. అలాగే గంజాయి, సత్తా, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలపై, భైంసా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

Read More మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గోపీనాథ్, ఎఎంసి చైర్మన్ ఆనంద్ రావు పటేల్, సైకాలజిస్ట్ డాక్టర్ సురేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శివరంజని రెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఎ. రషీద్, హఫీజ్ అబ్దుల్ లతీఫ్, హఫీజ్ మునీర్ తదితరులు పాల్గొని విలువైన సందేశాలు అందించారు. కార్యక్రమం ముగింపులో, మాదకద్రవ్యాల వాడకం పై నిర్వహించిన రాతపూర్వక పోటీలో విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, సానుకూల కార్యకలాపాలలో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో యువ కాంగ్రెస్ నాయకులు మోయిజ్ అహ్మద్, ముహమ్మద్ షఫీ, గడ్పాల్ దక్ష, అర్ష ప్రసాద్, మహేష్, అబ్బో లాలా, అజాన్ తదితరులు పాల్గొన్నారు.

Read More ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో

 

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

About The Author