అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన సంక్షేమ శాఖ అధికారులు.

 అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన సంక్షేమ శాఖ అధికారులు.

1000005786w

కామారెడ్డి,(భారత శక్తి ప్రతినిధి) ఆగస్టు 12: మంగళవారం  మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్  ఝాన్సీ రాణి  జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము కలెక్టరేట్ కామారెడ్డిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న పథకాలను పై సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆధ్వర్యంలో లోని ఐదు సిడిపిఓ ప్రాజెక్టుల అధికారులతో మాట్లాడి వారి యొక్క సమస్యను అడిగి తెలుసుకున్నారు. 

Read More సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలి.

వారికి తగు సూచనలు చేయడం జరిగింది. కామారెడ్డి నందుగల డ్రైవర్స్ కాలనీ వన్ అంగన్వాడీ కేంద్రాన్ని, రాజీవ్ నగర్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. తదుపరి సఖి కేంద్రం( వన్ స్టాప్ సెంటర్) ను సందర్శించి, సఖి కేంద్ర నిర్వాణకై సిబ్బందితో సమీక్ష జరిపినారు. సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది, నూతనంగా నిర్మించుచున్న సఖి భవన నిర్మాణం పనితీరును పరిశీలించినారు.    చివరగా ప్రభుత్వ బాలికల వసతి గృహమును సందర్శించినారు. చిల్డ్రన్ హోమ్ లోని బాలికలతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు భోజన వసతి ఆరోగ్య సదుపాయాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూపరిండెంట్ ఆదేశించినారు. ఈ సందర్భంగా ఆర్జెడి ఝాన్సీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు సంతృప్తిగా ఉందని తెలపడం జరిగింది. 

Read More విద్యార్థుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదు..

 

Read More అనర్హులను తొలగించి అర్హులకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి.

About The Author