నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం..

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల. ఆదేశాల మేరకు, ఈరోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో "నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం" లో భాగంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన” పై ఒక విశేషమైన సామూహిక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం
Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం
అలాగే మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా లేదా వినియోగం గమనించిన వెంటనే పోలీస్ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఒకవేళ ఎవరైనా మాదకద్రవ్యాల వ్యాపారం గానీ,రవాణా లేదా వినియోగం గమనించిన వెంటనే 100 నంబరుకు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువత,మహిళలు గ్రామాల్లోని ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
About The Author
06 Dec 2025
