అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

WhatsApp Image 2025-08-11 at 6.06.10 PM

    రాజన్న సిరిసిల్ల :  ప్రజల సమస్యలే పరిష్కార పరిష్కారకంగా తీసుకున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన బాధితుల సమస్యలపై అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 114 దరఖాస్తులు వచ్చాయని అందులో రెవెన్యూ శాఖకు 36, గృహ నిర్మాణ శాఖకు 26, డీఆర్డీఏ 20, ఉపాధి కల్పన శాఖకు 7, పంచాయితీ, సంక్షేమ శాఖలకు 5 చొప్పున, పౌర సరఫరాల శాఖకు 4, సెస్ కు 3, ఎస్డీసీ, మున్సిపల్ కమీషనర్ సిరిసిల్ల కు 2 చొప్పున, వ్యవసాయ, వైద్యారోగ్య, విద్యా శాఖ, ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Read More భైంసా నూతన ఎంపీఓ గా జాదవ్ ప్రదీప్ బాధ్యతలు స్వీకారం.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More హుజుర్నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా

About The Author