మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌..

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌..

ఉమ్మడి వరంగల్ బ్యూరో,(భారత శక్తి)ఆగష్టు12:
నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు, సాక్ష్యాధారాలను   సేకరించే  ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌  విభాగం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతనంగా మొబైల్‌ ఫోరెన్సిక్‌  వాహనం అందజేసారు. ఈ వాహనాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. 

ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్‌, ఫింగర్‌ ప్రింట్‌ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనంలో చేరుకోని, సంఘటన జరిగిన స్థలం నుండి రక్తమరకలు, వ్రేలిముద్రలతో ఇతర సాక్ష్యాదారాలను సేకరించి, ఈ మొబైల్‌ వాహనంలో ఏర్పాటు చేసిన  అధునిక పరికరాలతో  పరీక్షలను  నిర్వహించి, సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాధమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు రవి,సురేష్‌కుమార్‌, రిజినల్‌ ఎఫ్‌.ఎస్‌.ఎల్‌ జాయింట్‌ డైరక్టర్‌ నీరజ, ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఇన్స్‌స్పెక్టర్లు రాజ్‌కుమార్‌,శ్రీధర్‌, ఆర్‌.ఐలు శ్రీధర్‌,స్పర్జన్‌రాజ్‌, శ్రీనివాస్‌,చంద్రశేఖర్‌, ఫింగర్‌ ప్రింట్‌ ఎస్‌.ఐ కిరణ్‌తో ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Read More  అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన సంక్షేమ శాఖ అధికారులు.

About The Author