మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన వరంగల్ పోలీస్ కమిషనర్..
ఉమ్మడి వరంగల్ బ్యూరో,(భారత శక్తి)ఆగష్టు12:
నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు, సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అందజేసారు. ఈ వాహనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో వున్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని వరంగల్ కమిషనరేట్ పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది.
ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనంలో చేరుకోని, సంఘటన జరిగిన స్థలం నుండి రక్తమరకలు, వ్రేలిముద్రలతో ఇతర సాక్ష్యాదారాలను సేకరించి, ఈ మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన అధునిక పరికరాలతో పరీక్షలను నిర్వహించి, సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాధమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు రవి,సురేష్కుమార్, రిజినల్ ఎఫ్.ఎస్.ఎల్ జాయింట్ డైరక్టర్ నీరజ, ఫింగర్ ప్రింట్ విభాగం ఇన్స్స్పెక్టర్లు రాజ్కుమార్,శ్రీధర్, ఆర్.ఐలు శ్రీధర్,స్పర్జన్రాజ్, శ్రీనివాస్,చంద్రశేఖర్, ఫింగర్ ప్రింట్ ఎస్.ఐ కిరణ్తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.