పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

కరీంనగర్ ప్రతినిధి : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో పంద్రాగస్టు వేడుకలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని, వర్షాలు కురుస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య బృందాన్ని,108 అంబులెన్స్ ను వేడుక వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకూ తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Read More నేటి భారతం:
About The Author
08 Nov 2025
