బాలికల రెసిడెన్షియల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

బాలికల రెసిడెన్షియల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

వేములవాడ,ఆగస్టు 12 (భారత శక్తి) : విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు, మెనూ ప్రకారం  భోజనం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని,మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ గర్ల్స్ విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్ స్టోర్ రూమ్ లలో తిరిగి, స్వయంగా గరిటతో వంటకాలను కలిపి వాటి నాణ్యతను, ల్యాబ్, లైబ్రరీ, ఆట స్థలమును పరిశీలించారు. విద్యార్థులతో హాస్టల్ వసతులు నాణ్యమైన భోజనం పెడుతున్నారా, అని విద్యార్థులను సౌకర్యాలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే విద్యాలయంలోని 9,10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథ్స్ ఎకనామిక్స్, ఇంగ్లీష్ పాఠాలను బోధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కొందరు టీచర్లు, విద్యార్థులకు, సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి, వారికి సూచనలు చేశారు, అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతు క్లాస్ రూమ్ కి వెళ్లే ఉపాధ్యాయులు ముందుగా సంబంధిత సబ్జెక్టు పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని ఆదేశించారు.

Read More హత్యాయత్నం కేసులో నిందుతులకు ఐదేళ్లు జైలు

దీంతో విద్యార్థులకు సబ్జెక్ట్ పై పూర్తి స్థాయిలో పట్టు వస్తుందని తెలిపారు.మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన 30 బెంచీలను ఇతర విద్యాలయాల నుండి తెప్పించవలసిందిగా, ప్రతినిత్యం జిల్లా విద్యాధికారి తనిఖీలు నిర్వహించవలసిందిగా డి.ఈ.ఓ ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామల, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు ఉన్నారు. 

Read More ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ను కచ్చితంగా ప్రదర్శించాలి.

1000005750

Read More సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలి.

About The Author