రసాయన బొమ్మలు వద్దు.. మట్టి వినాయకుడే ముద్దు
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, ఆగష్టు 14 (భారత శక్తి):రాబోయే వినాయక చవితి సంధర్భంగా పీ&టీ కాలనీ నందు గణేష్ యువభక్త మండలి ఆధ్వర్యంలో దాదాపు 40 ఫీట్ల మట్టి గణపతి నిర్మాణ పనుల కార్యక్రమంలో గురువారం ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ, ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందని, నియోజకవర్గ పరిధిలోని సుమారు 90,000 ఇండ్లలో గణపతిని పూజించే వారంతా మన పురాతన, శాస్ట్రోతమైన సంప్రదాయ మట్టి వినాయకులను పూజించాలని, రసాయన రంగులతో కూడిన ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరగవు. అదే మట్టితో చేసిన విగ్రహాలు అయితే వెంటనే రెండు లేదా మూడు గంటలలో కరగడం జరుగుతుంది.పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.మనలో ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.మన పూర్వీకులు చెరువు మట్టితో వినాయక విగ్రహాన్ని తయారుచేసి తిరిగి అదే చెరువులో నిమజ్జనం చేసేవారని,మన పండుగల్లోని పరమార్థం.మన ఆరోగ్యం, ప్రకృతిని కాపాడుకోవడమేనని తెలిపారు.