వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాచలం : 

WhatsApp Image 2025-09-04 at 5.21.52 PM

పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ గురువారం ప్రకటనలో తెలిపారు. గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్‌ల వద్ద లాంచీలు బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు  వంటి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. నదీ తీర ప్రాంతంలో ఎటువంటి అపశృతి జరగకుండా విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ భక్తులకు, గణేశ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపులో భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించాలని, పెద్ద సంఖ్యలో గుంపులు ఏర్పడి అల్లర్లు చేయకుండా శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలన్నారు. ఊరేగింపుల సమయంలో డీజేలు, అధిక శబ్దపూరిత మ్యూజిక్ వాడకూడదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా మున్సిపల్, పోలీస్ శాఖల సూచనల మేరకు మాత్రమే ఊరేగింపులు కొనసాగించాలన్నారు. నిర్దేశించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నదీ ఘాట్ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచించారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాలకు రాకూడదని, విగ్రహాల నిమజ్జనం క్రమపద్ధతిలో జరగాలని ఆయన హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, శాంతియుతంగా వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Read More డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

About The Author