అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి..
కొర్లకుంట చిత్తారమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..
జిన్నారం:
అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
జిన్నారం మున్సిపల్ పరిధిలోని కొర్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించి నూతన దేవాలయాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.

About The Author
09 May 2026
