ఓటర్ల జాబితా ప్రక్షాళనకు రాజకీయ పార్టీలు సహకరించాలి..
- ఎల్బీ నగర్ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ.బి. వంశీ కృష్ణ,సరూర్ నగర్ ఏఈఆర్ఓ బి. శ్రీనివాస్, ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ కె. మల్లికార్జున్,
- రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
- బూత్ స్థాయి ఏజెంట్ల(BLA) నియామకానికి ఆదేశం
ఎల్బీ నగర్:
ఓటర్ల జాబితాను పారదర్శకంగా, దోషరహితంగా రూపొందించడంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO), హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ బి. వంశీ కృష్ణ అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడటమే లక్ష్యంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - 2002’ (SIR) ప్రక్రియను చేపట్టామని వివరించారు.
క్షేత్రస్థాయిలో సమన్వయం అవసరం:
పాల్గొన్న అధికారులు - ప్రతినిధులు:
ఈ సమావేశంలో సరూర్ నగర్ ఏఈఆర్ఓ బి. శ్రీనివాస్, ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ కె. మల్లికార్జున్ రావు, హయత్ నగర్ డిటీ అనిల్ కుమార్, ఎన్నికల డిటీ పి.వి.ఎల్. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల తరఫున కాంగ్రెస్ ప్రతినిధులు బుడ్డ సత్యనారాయణ, చర్ల రమేష్, సీపీఐ నుంచి బాతరాజు నర్సిమ్మ, రమావత్ సక్రు నాయక్, సీపీఐ(ఎం) నుంచి కె. నర్సిరెడ్డి, చింతపల్లి కృష్ణయ్య, సీపీఎం నుంచి ఎ. యల్లయ్య, ఎం. నరహరి, కె. గణేష్ గౌడ్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతినిధి కె. అనికేత్ హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణలో తాము పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు అధికారులకు హామీ ఇచ్చారు.
