రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో తుఫాను ప్రభావo
జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలలి - జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి :
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 1.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 1.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని ఐదు జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే, నవంబర్ మొదటి వారం నుండి ధాన్యం మార్కెట్లోకి రావచ్చని అంచనా దృష్ట్యా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సన్నద్దంగా ఉండాలని తెలిపారు.
వాతావరణ శాఖ సూచనల మేరకు తుఫాను ప్రభావం ఉన్నందున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అలాగే ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాలకృష్ణ, ఉద్యాన శాఖ అధికారి సునిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
