ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి..
- కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి :
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో శిక్షణా సివిల్ సర్వీసెస్ అధికారులు, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల సంక్షేమ, డిఆర్డీఓ, ప్రణాళిక శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, అవసరాలను తెలుసుకుని ఆచరణలోకి తీసుకువెళ్లే విధంగా యంత్రాంగానికి సూచనలు చేయాలని సూచించారు. అధికారుల పర్యటనకు స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వైద్యాధికారి డా మధుసూదన్,
డీఈఓ రాజేందర్, వ్యవసాయ అధికారి బాబూరావు, డిఆర్డీఓ బాల కృష్ణ, సీపీఓ బాబూరావు, సంక్షేమ అధికారి మల్లేశ్వరి
తదితరులు పాల్గొన్నారు.
About The Author
12 Mar 2026
