నేటి నుండి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 23 (భారతశక్తి ): ములుగు జిల్లాలో 20 గ్రామాలలో స్వచ్చ సర్వేక్షన్ 2025 కేంద్ర బృంధం సర్వే నేటి నుండి ప్రారంభం అవుతుందనీ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తెలిపారు.
స్వచ్చా సర్వేక్షణ్ ప్రత్యేక ఆప్ ద్వారా సర్వే నిర్వహించి ఉత్తమ గ్రామ పంచాయితీలకు గాను పురస్కారాలు అందించనున్నారని, ములుగు జిల్లా వ్యాప్తంగా 10 మండలాలు, 171 గ్రామపంచాయితీలు ఉన్నాయని తెలిపారు. ఎంపిక చేసిన 20 గ్రామాలలో, కేంద్రం ఎంపిక చేసిన 16 ఇళ్ళ లో సర్వే నిర్వహించనున్నారు. అందులో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తడి, పొడి చెత్త నిర్వహణ, గ్రామపంచాయితీలలో సానిటేషన్, పరిశుభ్రత తదితర అంశాలను సర్వే చేయనున్నారు. పంచాయితీ భవనం, పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర గ్రామపంచాయితీ అసెట్స్ ని తనిఖీ నిర్వహించనున్నారు.
కేంద్రప్రభుత్వ బృందం బుధవారం మర్యాద పూర్వకంగా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), డి ఆర్ డి ఓ సంపత్ రావు ను కలిసి సర్వే విధానాన్ని వివరించారు.అడిషనల్ కలెక్టర్ ఎం. సంపత్ రావు జిల్లా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం మధు, రాకేష్, రాజు వెంకటనారాయణ, ఎస్బీఎం కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.