ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి
అదనపు కలెక్టర్- సీతారామారావు
సూర్యాపేట :

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను జిల్లా అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ఆదేశించారు.సోమవారం ఆయన కలెక్టరెట్ సమావేశ మందిరంలో ప్రజవాణి లో పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నా వాటి పై దృష్టి సారించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
డిఆర్ డి ఏ పి డి వి వి అప్పారావు, హోజింగ్ పి డి సిదార్ధ, డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డి సి ఓ పద్మ, డి ఇ ఓ అశోక్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి,సూపర్టీడెంట్లు,అధికారులు, సిబ్బంది తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరుయ్యారు
About The Author
13 Mar 2026
