శివాలయం హుండీ లెక్కింపు

WhatsApp Image 2025-11-19 at 7.37.08 PM

మణుగూరు : 

మున్సిపాలిటీ పరిధిలోని దేవాదాయశాఖ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం నందు బుధవారం ఉదయం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి భక్తులు కానుకల రూపంలో చెల్లించుకున్న కానుకలను లెక్కించగా నోట్ల రూపంలో రూ 1,34,930, కాయిన్స్ రూపంలో రూ   21,392, మొత్తం రూ 1,56,322/_లు ఆదాయం సమకూరింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్ శేషయ్య దేవాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకులు పి .బెల్ సింగ్, దేవస్థానం చైర్మన్ కూచిపూడి వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

About The Author