దేశంలో ఈసీ ఓట్ల దొంగ‌త‌నం ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం..

కామారెడ్డి

డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు 

WhatsApp Image 2025-08-11 at 3.28.50 PM

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..  ఏడవ తారీఖున రాహుల్ గాంధీ  ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో పటిష్టమైన ఆధారాలతో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈసీ బీజేపీ రెండు ఒకటే అని నిరూపించారు. మోడీ ప్రధాని పీఠంపై దొడ్డి దారిన కూర్చున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కళ్ళు తెరిచి ఓటరు జాబితాను నిష్పక్షపాతంగా వ్యవహరించి తప్పులను సరిదిద్ది ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలని, ఈసీకి ఎవరైనా తమ అనుమానాలను అడిగితే వారిని బెదిరించే ధోరణి మానుకోవాలని, బీహార్ ఎన్నికలు బ్యాలెట్ తో నిర్వహించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని,దీంతో బిజెపి అసలు రంగు బయటపడుతుందని ఆయన అన్నారు.

Read More అలసత్వం వద్దు..

ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సరిదిద్దుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గ్రామాల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ పోరాటం కోన సాగిస్తాం, అయినా ఇలాగే కొనసాగితే ఎన్నికలు బహిష్కరించే రోజులు కూడా వస్తాయన్నారు.

Read More నేటి భారతం

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, గోనె శ్రీనివాస్ , గుడుగుల, శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, రాజా గౌడ్, ఐరేని సందీప్, పంపరీ లక్ష్మణ్, లక్ష్మీరాజ్యం, మసూద్, రాంకుమార్ గౌడ్, సర్వర్, జమీల్, సిద్దిక్ , సిరాజ్, భాస్కర్, దోమకొండ శ్రీనివాస్, లక్క పతిని గంగాధర్, కిరణ్, కస్తూరి, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Read More ఉద్యోగుల సంక్షేమానికి హెల్త్ స్కీమ్ అవసరం..

About The Author