యూరియా కొరతతో రైతులు అల్లాడుతున్నారు

యూరియా సమస్య ఎప్పటిలోపు పరిష్కరిస్తారో ప్రభుత్వ విప్ స్పష్టతనివ్వాలి. తక్షణమే పరిష్కరించకపోతే నిసన కార్యక్రమాలు చేపడతామని చల్మెడ డిమాండ్.

వేములవాడ :

WhatsApp Image 2025-08-11 at 6.51.39 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, మండలానికి యూరియా కేటాయింపులో పక్షపాత ధోరణి దారుణమని బీఆర్‌ఎస్‌ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ,యూరియా సరఫరాలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు గంటల తరబడి కేంద్రాల వద్ద బారులు తీరాల్సి వస్తోందని ఆరోపించారు. గత నాలుగు రోజులుగా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు, యూరియా కోసం అర్ధరాత్రి వరకు క్యూల్లో నిలబడే పరిస్థితులు ఏర్పడ్డాయని,ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. రుద్రంగి సహా పలు ప్రాంతాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా, స్థానిక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించకపోవడం బాధకరమని విమర్శించారు. జిల్లాకు ఎంత యూరియా అవసరమో,ఎంత వచ్చిందో, ఇంకా ఎంత కొరత ఉందో సమీక్షించి చర్యలు తీసుకోవడంలో అధికారులు,విప్ విఫలమయ్యారని ఆయన అన్నారు.చందుర్తి, సనుగుల సొసైటీల వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ జరుగుతోందని పేర్కొంటూ,ఇది పరిస్థితుల తీవ్రతకు నిదర్శనమని అన్నారు.కాళేశ్వరం నుంచి నీరు రాకపోవడంతోనే సాగు కష్టాల్లో ఉన్న రైతులకు,పంటలకు సకాలంలో యూరియా ఇవ్వక ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు.

Read More ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా కృషి...

రైతుల పట్ల వివక్షతను బీఆర్‌ఎస్‌ సహించబోదని స్పష్టం చేస్తూ, యూరియా సమస్య ఎప్పటిలోపు పరిష్కరిస్తారో ప్రభుత్వ విప్ స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మంగళవారం నుండి వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Read More భైంసా సబ్ కలెక్టర్‌గా అజ్మీరా సాంకేత్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.

రైతుల ఆవేదన కట్టలు తెంచుకునే ముందు యూరియా సరఫరా పూర్తి చేయాలని, సరఫరా గడువుపై స్పష్టత ఇవ్వాలని చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్‌ చేశారు.

Read More పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు..

About The Author