రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు సోలార్ పవర్ ప్లాంట్లు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

కరీంనగర్ :ఇందిరా సౌర గిరిజల వికాసం వేగవంతం చేయాలనీ, ఏజెన్సీ ప్రాంత అధికారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపాలని, సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సిఎండి ముషారఫ్ ఫారుకి, రెడ్కో సిఎండి అనిలా తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు , ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.
నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయి వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు. నల్లమల డిక్లరేషన్ లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గం లో ప్రారంభించాం ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కలెక్టర్లు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా వివరాలు పంపండి, ఈ విషయాల్లో ఎలాంటి సందేహాలు ఉన్న విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్పీడీసీఎల్, సీఎండీలు ని సంప్రదించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లను ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు పాల్గొన్నారు.
