నేటి భారతం :

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమున్నది గర్వకారణం..?
ఎక్కడ దోచుకోవచ్చో అక్కడ దృష్టి పెడతారు..
దానికోసం ఒక పథకం ఏర్పాటు చేస్తారు..
అది ప్రజా ప్రయోజనం కోసమే అన్నట్లుగా కలరింగ్ ఇస్తారు..
కానీ అసలు విషయం ఏమిటంటే అందులో ఎంత ఎక్కువ
కమిషన్లు దొరుకుతాయి అన్నది మాత్రమే చూస్తారు..
అవి నీటి ప్రాజెక్టులు కావచ్చు ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు..
ఏ రాయి అయితే నేమీ నెత్తి పగలగొట్టుకోవడానికి..
విచిత్రం ఏమిటంటే ప్రజలే పన్నులు కడతారు..
ప్రజలు కట్టిన పనులతోటే ఈ ప్రాజెక్టులు మొదలుపెడతారు..
కానీ ఆ ప్రాజెక్టులు ప్రజల కోసం ఎప్పుడూ పనికిరావు..
కేవలం అధికార ప్రభుత్వాల నాయకులు దోచుకోవడానికి మాత్రమే..
రాజకీయం అనే పదానికి అర్థం మారిపోయింది..
అరాచకం మాత్రమే మిగిలిపోయింది..
హతవిధీ ఏమిటి బడుగు, బలహీనవర్గాలు,
సామాన్యులు, నిరుపేదల పరిస్థితి..?
About The Author
06 Dec 2025
