నేటి భారతం:
.jpeg)
సమర్థులుగా గుర్తింపు సాధించాలంటే కొన్ని పాటించాలి..
నీకు విలువ లేని చోటుకు వెళ్ళకు..
అలాగే అబద్ధం చెప్పే చోటుకి వెళ్ళకు..
మరీ ముఖ్యంగా కలహం ఉన్నచోటికి వెళ్ళకు
సోమరులు నివసించే చోటుకి అసలు వెళ్ళవద్దు..
అధర్మం జరిగే చోటకి దూరంగా ఉండటం మంచిది..
నీకు అవసరమైన సమయంలో సహాయం చేయని
బంధుమిత్రుల వద్దకు వెళ్ళకు..
నీఆదర్శాలకు రాజీ పడే చోటకు..ఇక జూదం, మద్యం,
కామం, ఆధిపత్యం చలాయించే చోటుకి .
ఈర్ష్య అనే మహమ్మారి నిండిన చోటకు..
అవమానం జరిగే చోటకు..జ్ఞానాన్ని అవమానించే చోటకు..
అధర్మ పరిపాలన చేసే రాజు దగ్గరకు...
నీ సిద్ధాంతాలకు వంగవలసి వచ్చిన చోటికి అసలు వెళ్ళకు..
- కౌటిల్య విష్ణు గుప్త..
About The Author
26 May 2026
