ముగ్గురు కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగోన్నతి.

ప్రమోషన్ తో పాటు బాధ్యతలు పెరుగుతాయి.

ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి.

 సూర్యాపేట జిల్లా ఎస్ పీ కే నరసింహ 

ముగ్గురు కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగోన్నతి.

సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 18:

సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న కానిస్టేబుల్ వి.ఉపేందర్, పాలకీవీడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, మునగాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జి.శ్రీకాంత్ లు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పి ని మర్యాదపూర్వకంగా కలవగా జిల్లా ఎస్పీ నర్సింహా ప్రమోషన్ పొందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ లకు ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపినారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగోన్నతి తో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలు కు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని,పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఎస్పీ కోరారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డి ఎస్ పి నరసింహ చారి,పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More పచ్చదనం పెంపొందించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

About The Author